ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అంటే ఏంటి? దీనికి ఎలా అప్లై చేయాలి?

ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ని ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పి ఏం జె ఏ వై ) అని కూడా అంటారు. ఈ స్కీమ్ ఆర్ధికంగా బలహీనంగా ఉన్న భారతీయులకోసం మరియు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల అవసరం ఉన్న వారికోసం ఉపయోగ పడుతుంది.

మన ప్రధానమంత్రి ఈ ఆరోగ్య భీమాను 23 సెప్టెంబర్ 2018 న ప్రారంభించారు. ఈ భీమా సుమారు 50 కోట్ల భారత పౌరులకు అందుబాటులో ఉంటుంది. రిపోర్టుల ప్రకారం ఇప్పటివరకు 18,059 హాస్పిటల్స్ ఏంచుకోబడ్డాయి మరియి 4,406,461 లక్షల బెనెఫిషరీస్ ను అడ్మిట్ చేసారు. 10 కోట్ల  వరకు e-  కార్డులు ఇవ్వబడ్డాయి.

ఈ యోజన ప్రథమ ఉద్దేశం ద్వితీయ మరియు తృతీయ ఆరోగ్య సంరక్షణ పూర్తిగా నగదు రహితo చేయడమే. ఈ పధకం ఉన్నవారికి ఒక e- కార్డు ఇవ్వబడును. ఈ కార్డు ఉపయోగించి దీనికి సంబంధించిన ఏ హాస్పిటల్ లో అయినా, ప్రైవేట్ లేదా గవర్నమెంట్ ఆసుపత్రి కైనా నేరుగా వెళ్లి నగదు రహిత చికిత్సని పొందవచ్చు.

దీంట్లో 3 రోజుల ప్రీ హాస్పిటలైజేషన్ ఖర్చు మరియు 15 రోజుల పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చు కవర్ చేయబడుతుంది. ఈ యోజన ఉన్నవారు చేతిలో డబ్బు లేకున్నా తమ ఆరోగ్య చికిత్సలు చేయించుకోవచ్చు.

ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కు అప్లై చేసే విధానం:

  • https://www.pmjay.gov.in/ కి వెళ్లి నేను అర్హుడినేనా అని క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చ ఎంటర్ చేసి జెనెరేట్ ఓటీపీ క్లిక్ చేయండి.
  • తరువాత మీ మొబైల్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, మీ యొక్క రాష్ట్రం  పేరు ఎంటర్ చేసి సర్చ్ చేయండి.
  • మీకు వచ్చిన ఫలితాల ద్వారా మీయొక్క కుటుంబానికి పి ఏం జె ఏ వై స్కీమ్  వర్తిస్తుందో లేదో మీరు  తెలుసుకోవచ్చు.

ఆయుష్మాన్ భారత్ పధకం అంటే ఏంటి What is Ayushma Bharat Yojana in Telugu?

ఆయుష్మాన్ భారత్ పధకాన్ని ప్రధానమంత్రి జాన్ ఆరోగ్య యోజనా లేదా నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీం లేదా మోదీకేర్ అని పిలుస్తారు. ఈ పధకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 10 కోట్ల కుటుంబాలకు ఏటా రూ. 10 లక్షల ఆరోగ్య బీమాను అందిస్తోంది. ఇక వారు ఉచితంగా చికిత్స చేయించుకునేందుకు ఆయుష్మాన్ కార్డులు అవసరమని తెలిపింది.

ఆయుష్మాన్ భారత్ యోజన కింద క్యాన్సర్‌తో సహా సుమారు 1300కిపైగా వ్యాధులకు ఉచితంగా చికిత్స పొందవచ్చు. ఈ పధకానికి మీరు అర్హులై ఉండి.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే.. మీ దగ్గర ‘ఆయుష్మాన్ కార్డు’ ఉండాలి. ఆయుష్మాన్ కార్డును ‘ఆయుష్మాన్ భారత్ యోజన గోల్డెన్ కార్డు’ అని కూడా పిలుస్తారు. ఈ కార్డు పొందేందుకు ఆయుష్మాన్ భారత్ పధకం కిందకు వచ్చే ఆసుపత్రులను కూడా ప్రజా సేవా కేంద్రాన్ని గానీ సంప్రదించాల్సి ఉంటుంది.

ఆయుష్మాన్ భారత్ యోజన అనేది పేదల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం తీసుకున్న ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం. ఇందులో రెండు ప్రధాన ఆరోగ్య కార్యక్రమాలు Health and Wellness Center (HWC) మరియు ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY) Pradhan Manthri Jann Arogya Yojana ఉన్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే లబ్దిదారులు ఈ కార్డును పొందేందుకు ప్రభుత్వం ప్రజా సేవా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మీరు ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ సహాయంతో ఈ ఆయుష్మాన్ కార్డులను ఉచితంగా పొందవచ్చు. ఇదిలా ఉంటే ఆయుష్మాన్ ఇండియాలో కొత్త నిబంధనను అమలులోకి తీసుకొచ్చారు.

ఈ పధకానికి అనుసంధానమైన కుటుంబంలోని మహిళ పెళ్లి చేసుకుంటే.. ఆమె భర్తకు ఉచితంగా చికిత్స కోసం కొరకు ఆయుష్మాన్ కార్డు లేదా డాక్యుమెంట్స్ చూపించాల్సిన అవసరం లేదని.. ఆమె ఆధార్ కార్డు చూపిస్తే చాలని కేంద్రం తెలిపింది.

ప్రభుత్వ సౌకర్యాలు సరిగా లేకపోవడం వల్ల తక్కువ ఆదాయ కుటుంబాలకు నాణ్యమైన వైద్యం అందించడం అసాధ్యం. ఈ ప్రయోజనం కోసం భారత ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన అని పిలువబడే ప్రభుత్వ నిధులతో కూడిన ఆరోగ్య సంరక్షణ పథకాన్ని సెప్టెంబర్ 2018 లో ప్రారంభించారు.

ఆయుష్మాన్ భారత్ యోజన ప్రారంభించడం వలన భారతదేశవ్యాప్తంగా అర్హత ఉన్న కుటుంబాలలో ఎక్కువమందికి ఇప్పటికీ దాని గురించి తెలియదు. ఆయుష్మాన్ భారత్ యోజన కింద ప్రయోజనాలను పొందడానికి ఈ పథకం యొక్క ప్రాథమికాలను అర్థం చేసుకోవడం అవసరం. మరియు మీకు సహాయం చేయడానికి మేము ఇక్కడ ఉన్నాము.

ఈ పథకం ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు రహిత చికిత్సను అందిస్తుంది. అంతేకాకుండా మోకాలి మార్పిడి కరోనరీ బైపాస్ మరియు ఇతర ఖరీదైన శస్త్రచికిత్సలు కూడా కవర్ చేయబడతాయి.

Ayushman bharath scheme

ఆయుష్మాన్ భారత్ యోజన పథకం యొక్క ప్రయోజనాలు ఏమిటి? (Benefits of Ayushman Bharat Scheme in Telugu):

భారతదేశంలోని ప్రతి బలహీన కుటుంబానికి వైద్య చికిత్స అందుబాటులో ఉంది. అయితే ఆయుష్మాన్ భారత్ యోజన నుండి వైదొలగిన రాష్ట్రాలు చికిత్స సౌకర్యాలను పొందలేవు.ఇది భారతదేశంలోని బాలికలు మరియు సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యతనిస్తుంది.

ఇది ఇప్పటికే ఉన్న వ్యాధుల డే-కేర్ ట్రీట్మెంట్ ఫాలో-అప్‌లు మరియు మొదలైన వాటిని కవర్ చేస్తుంది.భారతదేశంలోని అన్ని తృతీయ మరియు మాధ్యమిక ఆసుపత్రుల నుండి వైద్య చికిత్సలు పొందవచ్చు.

స్కీం లో ఇలా రిజిస్టర్ అవ్వండి? How to Register?

  • మొదటగా మీరు https://mera.pmjay.gov.in అవ్వండి.
  • వెబ్‌సైట్‌లోని ‘నేను అర్హత ఉన్నవాడిని’ ఎంపికపై క్లిక్ చేయండి.
  • మీ పేరు ఫోన్ నంబర్ రేషన్ కార్డ్ నంబర్ ,మీ మొబైల్ నంబర్‌ను సమర్పించిన తర్వాత మీరు ఒక OTP ని అందుకుంటారు.
  • జనరేట్ చేసిన OTP ని సమర్పించండి.
  • మీరు నివసిస్తున్న రాష్ట్రాన్ని ఎంచుకోండి.
  • మీరు అన్ని సంబంధిత వివరాలను పూరించిన తర్వాత శోధన బటన్‌ని క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసినప్పుడు పేర్ల జాబితా వస్తుంది.
  • జాబితాలో మీ పేరు కోసం చూడండి.
  • మీరు ఆన్‌లైన్ పోర్టల్‌లో మీ అర్హతను తనిఖీ చేసిన తర్వాత మీరు ఆయుష్మాన్ భారత్ నమోదు మరియు దరఖాస్తు ప్రక్రియ కోసం ఎదురుచూడాలి.

ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్ కోసం ఏ పత్రాలు అవసరం Required Documents:

వయస్సు రుజువు (Age proof):

ఆయుష్మాన్ భారత్ యోజనను ఎంచుకోవడానికి చెల్లుబాటు అయ్యే వయస్సు రుజువు అవసరం.

గుర్తింపు (identifications):

పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ వంటి మీ గుర్తింపు రుజువును అందించండి.

సంప్రదించండి (contact):

మీ మొబైల్ నంబర్, ఇమెయిల్ ID, నివాస చిరునామా, వంటి మీ ప్రస్తుత సంప్రదింపు వివరాలను సమర్పించండి. పాలసీదారుని సంప్రదించడానికి ఏకైక మూలం కనుక సంప్రదింపు వివరాలను ఖచ్చితంగా పేర్కొనాలి.

ఆయుష్మాన్ భారత్ యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి? ( How to apply for ayushmam Bharath yojana in Telugu?)

  • ఆయుష్మాన్ భారత్ యోజన కోసం దరఖాస్తు చేసుకోవడానికి, ఎంపానెల్ ఆసుపత్రిని సందర్శించండి మరియు ఆయుష్మాన్ మిత్రుల కోసం చూడండి, వారు మీకు అడ్మిషన్‌లో సహాయపడతారు.
  • మీరు PMJAY పథకం కింద అర్హులు కాదా అని వారు నిర్ధారిస్తారు.
  • తరువాత వారు మీ గుర్తింపును ధృవీకరిస్తారు (ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు ద్వారా).
  • మీరు చికిత్స కోరుకుంటున్న ఆసుపత్రి బ్యాలెన్స్‌ని తనిఖీ చేస్తుంది.
  • చికిత్స కోసం అవసరమైన ఆధారాలను సమర్పించమని మీరు అభ్యర్థించబడతారు.
  • మీరు డిశ్చార్జ్ సారాంశం మరియు పోస్ట్ ట్రీట్మెంట్ సాక్ష్యాలను సమర్పించిన తర్వాత క్లెయిమ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ తర్వాత పరిష్కరించబడుతుంది.

అర్హత నిర్ధారించబడిన తర్వాత, లబ్ధిదారుడు ప్రధాన మంత్రి ఆరోగ్య మిత్ర (PMAM) లబ్ధిదారుడి గుర్తింపు మరియు అర్హతను లబ్ధిదారుని గుర్తింపు వ్యవస్థ beneficiary identify system (BIS) ఉపయోగించి ధృవీకరిస్తుంది. ఇది క్లియర్ అయిన తర్వాత లబ్ధిదారులకు ఇ-కార్డు జారీ చేయబడుతుంది.
మీరు హెల్ప్‌లైన్ నంబర్ 14555 కు కాల్ చేయడం ద్వారా సేవలను పొందవచ్చు.

ఆయుష్మాన్ భారత్  అర్హులు జాబితా: (Eligible People):

గ్రామీణ ప్రాంతాల్లో: (Rural areas) 

  • ఇల్లు లేని కుటుంబాలు
  • అనాథలు/ యాచకులు
  • సఫాయి కార్మికుల కుటుంబాలు
  • గిరిజన ఆదివాసీ కుటుంబాలు
  • వెట్టిచాకిరి నుంచి న్యాయపరంగా విముక్తి పొందిన    కార్మికులు
  • ఎస్సీ/ ఎస్టీ కుటుంబాలు
  •  మట్టి గోడలు, మట్టి కప్పు కలిగిన ఒక గది ఇల్లు ఉన్న కుటుంబాలు
  • 16 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్కులు లేని కుటుంబాలు
  • కుటుంబ పెద్దగా మహిళ ఉండి 16 నుంచి 59 ఏళ్ల వయసుగల పురుషులు లేని కుటుంబాలు
  • దివ్యాంగులు
  • భూమి లేని, రోజు కూలీ చేసుకుంటూ జీవించే కుటుంబాలు

పట్టణ ప్రాంతం: (Urban Area):

  • కూలీలు
  • చెత్త ఏరుకునేవారు
  • యాచకులు
  • ఇళ్లల్లో పనిచేసేవారు
  • వీధి వ్యాపారులు/ చర్మకారులు/ వీధుల్లో తిరిగి  సరుకులు అమ్మేవారు/ వీధుల్లో ఇతర పనులు  చేసుకుంటూ బతికేవారు
  • భవన నిర్మాణ కార్మికులు/ ప్లంబర్/ పెయింటర్/ వెల్డర్/ సెక్యూరిటీ గార్డు
  • స్వీపర్/ పారిశుద్ధ్య కార్మికులు/ తోటమాలీలు
  • హస్తకళలు/ చేతివృత్తులపై ఆధారపడి జీవించేవారు/దర్జీ (టైలర్)
  • ఎలక్ట్రీషియన్/ మెకానిక్/ డ్రైవర్/ కండక్టర్/ హెల్పర్/ రిక్షావాలా
  • దుకాణాల్లో పనిచేసేవారు/ అసిస్టెంట్లు/ వస్తువులను బిగించేవారు/ పనిముట్లను బాగు చేసేవారు వాచ్‌మెన్లు, రజకులు

ఈ కుటుంబాలు ‘ఆయుష్మాన్ భారత్‌’ పథకం కిందకు రావు (These families will not be covered under the AYUSHMAN BHARAT scheme):

* 2/3/4 వీలర్ మోటారు వాహనం, లేదా చేపలు పట్టే బోటు ఉన్న కుటుంబాలు

* 3/4 వీలర్ వ్యవసాయ యంత్రాలు ఉన్న కుటుంబాలు

* రూ.50 వేలకు మించి క్రెడిట్ పరిమితి గల కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన కుటుంబాలు

* కుటుంబ సభ్యుడు ప్రభుత్వ ఉద్యోగి అయితే

* ప్రభుత్వం వద్ద నమోదైన వ్యవసాయేతర సంస్థ కలిగి ఉన్న కుటుంబాలు

* కుటుంబంలోని ఎవరైనా ఒక సభ్యుడు నెలకు రూ. 10,000కు పైగా సంపాదిస్తుంటే

* ఆదాయపన్ను చెల్లిస్తున్న కుటుంబాలు

* ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లిస్తున్న కుటుంబాలు

* మూడు లేదా అంతకంటే ఎక్కువ గదుల పక్కా ఇల్లు కలిగిన కుటుంబాలు

* రిఫ్రిజిరేటర్ కలిగిన కుటుంబాలు

* ల్యాండ్‌లైన్ ఫోన్ కలిగిన కుటుంబాలు

* 2.5 ఎకరాలకు మించి సాగునీటి వసతి కలిగిన వ్యవసాయ భూమి, 1 వ్యవసాయ యంత్రం కలిగిన కుటుంబాలు

* రెండు కంటే ఎక్కువ పంటలు పండే ఐదెకరాల భూమి కలిగిన కుటుంబాలు

* కనీసం ఒక పంట పండించే ఏడున్నర ఎకరాల భూమి ఉండి, కనీసం ఒక వ్యవసాయ యంత్రం కలిగిన కుటుంబాలు.

ఆయుష్మాన్ భారత్ యోజనకు మీరు అర్హులో? కాదో తెలియాలంటే ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్‌ను జారీ చేసింది:

14555 / 1800111565 నెంబర్‌కు డయల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

అలాగే https://mera.pmjay.gov.in/search/login అఫీషియల్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీ అర్హతను తనిఖీ చేసుకోవచ్చు.
సో, ఫ్రెండ్స్ ఒకవేల మీరు అర్హుల జాబితా లో ఉంటె మీ పేరు పైన తెలిసిన విధంగా రిజిస్టర్ చేసుకోండి ఆయుశ్మాన్ భారత్ స్కీం లో చేరి వాటి  ప్రయోజనాలు పొందండి , మీరు మరియు కుటుంబ కుటుంబ సభ్యులు   ఊహించని విపత్తులనుండి కొంత మేరకు ఉపశమనం పొందడానికి యీ పథకం సహాయపడుతుంది . తెలంగాణ రాష్ట్రం కూడా ఇ పథకం లో చేరి కేంద్ర ప్రభుత్వం తో కలిసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తుంది.
Share:FacebookX
Join the discussion